రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల హెల్త్బులిటిన్
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం జరిగిన రైలు-స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల హెల్త్బులిటిన్ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదలచేశారు. విద్యార్థులు సాయిరామ్, రుచిక, సాత్విక, హరీష్, మహిపాల్ రెడ్డి, సద్భావన, దర్శన్గౌడ్, కరుణాకర్, శివకుమార్లను సాయంత్రం జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్యులు తెలిపారు.
నలుగురు చిన్నారులు అబ్జర్వేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. శ్రావణి, శిరీష, శరత్, వరుణ్, వైష్ణవి, తరుణ్, ప్రశాంతిల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యానికి తరుణ్ స్పందించడంలేదని యశోద ఆస్పత్రి వైద్యులు చెప్పారు.