కోమటిరెడ్డిపై మంత్రి ఫైర్‌

కోమటిరెడ్డిపై మంత్రి  ఫైర్‌


నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సభలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రవర్తించిన తీరుఫై మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మార్కెట్ శంకుస్థాపన సభను చెడగొట్టాలని ఉద్దేశ్యంతో గొడవ చేశాడని ఆరోపించారు. తాము రైతుల బాగు కోసం కృషి చేస్తుంటే అడ్డుకోవడం సరి కాదన్నారు. రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవనే  ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణా అదో గతి పాలైందన్నారు.


ఇకనైనా కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆపాలని కోరారు. కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్నదని  కాంగ్రెస్  పార్టీ వాళ్లేనని ఆరోపించారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అనంతరం మిర్యాలగూడ డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు డీఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top