గ్రూప్-2 ‘కీ’ విడుదల


 ఈ నెల 5 నుంచి అభ్యంతరాల స్వీకరణ  

 సాక్షి, హైదరాబాద్: గత నెల 11, 13 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం విడుదల చేసింది. దీన్ని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనుంది. అభ్యర్థులకు నిర్దేశించిన లింకు ద్వారా ఇంగ్లిషులో మాత్రమే అభ్యంతరాలను సమర్పించాలని, ఈ-మెయిల్, ఇతర పద్ధతుల్లో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.  

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top