గ్రేటర్ ఎన్నికల్లో గట్టి పోటీ

గ్రేటర్ ఎన్నికల్లో గట్టి పోటీ - Sakshi

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

  • సాక్షి,హైదరాబాద్: వచ్చే డిసెంబర్‌లో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను గట్టిగా ఎదుర్కొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ నేతలు పిలుపునిచ్చారు. లోటస్ పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా పరిశీలకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది.



    ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, మతీన్, నల్లా సూర్యప్రకాశ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఏప్రిల్ 9న డివిజన్ ముఖ్యనేతలు, రాష్ట్ర నాయకులతో కలసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరి నిర్ణయం తర్వాత 60 మంది సభ్యులతో హైదరాబాద్ జిల్లా కమిటీ, 20 మందితో డివిజన్ కమిటీలను భర్తీ చేస్తామన్నారు.



    త్వరలో నిజాం కాలేజీ గ్రౌండ్‌లో లక్ష మంది 10 జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో భారీ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే డివిజన్ల వారిగా తాగునీరు, విద్యుత్ సరఫరా, రేషన్ పంపిణీలోని సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.



    ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొట్టు సాయినాథ్ రెడ్డి, క్రిష్టోలైట్, సంయుక్త కార్యదర్శులు జి. శ్రీధర్ రెడ్డి, ఎస్. హరినాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి సత్యం శ్రీరం గం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ, కార్మిక, యువజన విభాగం రాష్ట్ర నేతలు అహ్మద్, ఎన్. బిక్షపతి, బి. రవీందర్, నగర మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు హర్షద్, సిటీ యువజన నాయకులు అవినాష్ గౌడ్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top