పింఛన్ల పరిశీలనకు గ్రేటర్ ఉద్యోగులు


* 83వేల దరఖాస్తులు పరిశీలించాలని ఆదేశం

* కలెక్టర్ లేఖకు సానుకూలంగా స్పందించిన సోమేష్


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సామాజిక పింఛన్ల పరిశీలనకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఉద్యోగులను రంగంలోకి దించారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే శివార్లలోని పది సర్కిళ్లలో పింఛన్ల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నగరపాలక సంస్థ ఉద్యోగుల సేవలను వినియోగించుకునే లా ఉత్తర్వులు ఇవ్వాలని ఇటీవల జిల్లా యంత్రాంగం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌కు లేఖ రాసింది. నవంబర్ 8 తేదీ నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నవంబర్ 2వ తేదీలోపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.



శివార్లలో 83వేల దరఖాస్తులను పరిశీలించాల్సివుండడంతో సిబ్బంది కొరతతో నిర్ణీత వ్యవధిలో ఈ పక్రియను పూర్తి చేయడం కష్టమని జిల్లా క లెక్టర్ ఎన్.శ్రీధర్ భావించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ ఉద్యోగులను దరఖాస్తుల పరిశీలనలో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్ ఉద్యోగులను నియమించాలని కమిషనర్‌కు లేఖ రాశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్‌పెక్టర్లను పింఛన్ల దరఖాస్తుల పరిశీలనకు విని యోగించుకునేలా కలెక్టర్‌కు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. నవంబర్ 2లోపు దరఖాస్తులను పరిశీలించాలని, మూడో తేదీన సొంత గూటికి చేరుకోవాలని నిర్దేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top