ప్రభుత్వ అసమర్థతతోనే ఎంసెట్ లీకేజీ
బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీకి ప్రభుత్వ అసమర్థతే కారణమని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పందించాలని డిమాండ్ చేశారు.