అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం - Sakshi

► ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం 

►  ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం  

►  మంత్రి ఈటల రాజేందర్‌

కరీంనగర్‌ : అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.  ఆదివారం ఉర్దూభవన్‌లో ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామన్నారు. ముస్లిం మైనార్టీల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకే బీసీ కమిషన్‌ పర్యటిస్తోందన్నారు. పేదింటి ఆడపిల్లలకు షాదీముబారక్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని, దానిని రూ. 75వేలకు ఇటీవలే పెంచామని గుర్తు చేశారు.

ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను హర్షించాల్సిన ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం మూర్ఖత్వమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ రవీందర్‌సింగ్, టీఆర్‌ఎస్‌ నాయకులు జమీలోద్దీన్, ముస్లిం మైనార్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top