హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేయనుంది. చిహ్నానికి సంబంధించి హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. మార్పులతో కూడిన లోగో వాడాలని ఉన్నతాధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.
అధికార చిహ్నంలో మూడు సింహాల బొమ్మ, సత్యమేవ జయతే అన్న వాక్యం వేర్వేరుగా ఉన్నాయని ఒకరు హైకోర్లు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.