నగరంలో దొంగల హల్‌చల్


హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఏరియాలో గురువారం రాత్రి దొంగలు కలకలం సృష్టించారు. ఇక్కడి జనప్రియ కాలనీలోని ఓ ఇంటిలోకి చొరబడ్డ దుండగులు 6 తులాల బంగారం, రూ.4 వేల నగదుతో ఉడాయించారు. వెళుతూ వెళుతూ ఇళ్ల ముందు ఉన్న నాలుగు కార్ల అద్దాలను ధ్వంసం చేసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం జనప్రియ కాలనీకి చేరుకుని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top