టీఆర్‌ఎస్‌ బలోపేతమే లక్ష్యం


కామేపల్లి: టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. శనివారం మండల పరిధిలోని కొత్తలింగాల గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బానోత్‌ నర్సింహానాయక్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కార్యకర్తలు వర్గాలను వీడి పార్టీ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని కోరారు.



ఈ నెల 27న వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు మండలం నుంచి 5 వేల మంది కార్యకర్తలను తరలించి పార్టీ సత్తాను చాటాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ మాత్రం అభివృద్ధికే పెద్దపీఠ వేశారన్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని, గ్రామాల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.



ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీపీ మాళోత్‌ సరిరాంనాయక్, సర్పంచులు అరెం రవి, జర్పుల రామోజీ, బి.రాంజీ, ఎంపీటీసీలు హట్కర్‌ పార్వతి, మాళోత్‌ రాంచందర్‌నాయక్, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కీసర విష్ణువర్థన్‌రెడ్డి, ఎస్‌కె ఫత్తేఅహ్మద్, మూడ్‌ కృష్ణప్రసాద్, వడియాల కృష్ణారెడ్డి, గ్రామశాఖల అధ్యక్షులు టి.వీరయ్య, కాట్రాల మల్లయ్య, కిషన్, సుంకర బిక్షం, కొనకంచి శంకర్, ఎం.రాంమూర్తి, శీలం పుల్లయ్య, నాయకులు భట్టు శంకర్, జి.నారాయణరెడ్డి, కాట్రాల రాంబాబు, జి.వెంకటరత్నం, డి.భద్రయ్య, చల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top