తల్లిదండ్రుల రోదనలతో హోరెత్తిన ఘటనా స్థలం
హైదరాబాద్: బస్సు ప్రమాదంలో మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం హోరెత్తింది. ఘటనా స్థలంలోనే తల్లితండ్రులు స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా 7వ తరగతి లోపువారేనని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 38మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్థి మండలం మాసాయిపేటలో వద్ద లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందారు.