విద్యకు ప్రాధాన్యమివ్వాలి

విద్యకు ప్రాధాన్యమివ్వాలి


ఖమ్మం: ప్రస్తుత కాలంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక విద్య తప్పనిసరి అని, అందుకు మజీద్‌ కమిటీలు తమవంతుగా మదార్సాల ద్వారా విద్యను అందించడం అభినందనీయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మజీద్‌–ఏ–ముస్తఫానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్సాను ప్రారంభించారు. పేద ముస్లిం మైనార్టీలకు మదర్సాల ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో, మంచి విలువలతో విద్యను అందించాలని సూచించా రు.


నిస్వార్థంగా చేస్తున్న సేవలో తాను స్వచ్ఛం దంగా పాల్గొని తనవంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మనోహర్, షౌకత్‌ఆలీ, ముఫ్తీరవూఫ్, షేక్‌ ముక్తార్, రషీద్, మహాబూబ్‌అలీ, రహీం, ఇల్లియాస్, రెహమన్, మోహినుద్దీన్, కరీముల్లా, జాఫర్, శ్రీధర్‌ పాల్గొన్నారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top