కుటుంబ సభ్యుల ఘర్షణ.. పసికందు ప్రాణం తీసింది!
గట్టు(మహబూబ్నగర్): కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ సందర్భంగా తల్లి చేతుల్లో ఉన్న చిన్నారి కిందపడి గాయాలతో చికిత్సపొందుతూ మృతి చెందింది. మల్దకల్ ఎస్ఐ శ్రీనివాస్రావు తెలిపిన వివరాలివీ.. మండల కేంద్రమైన గట్టుకు చెందిన ఆంజనేయులు, కవితలు భార్యభర్తలు. కవితకు ఆరునెలల క్రితం ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. కాగా, గత నెల 21వ తేదీన భర్త లేని సమయంలో కవితతో కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు.
ఈ క్రమంలో ఆమె చేతుల్లో ఉన్న కుమార్తె చిత్ర(6 నెలలు) జారి కిందపడింది. ఈ సంఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను గద్వాలలోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కూతరు మృతిపై తండ్రి ఆంజనేయులు ఆదివారం ఫిర్యాదు చేశాడు.