'కోర్టు వివాదాల వల్లే గ్రేటర్ ఎన్నికలు ఆలస్యం'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అయితే కోర్టు వివాదాల వల్లే సదరు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో మంత్రి టి.పద్మారావు మాట్లాడుతూ... ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందుకు సంబంధించిన పనులు అన్ని వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేసీఆర్ ప్రసంగిస్తారని పద్మారావు వెల్లడించారు.