నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్


హైదరాబాద్ : సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట ఐడీహెచ్ కాలనీలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. పనుల్లో ప్రగతిపై అధికారులతో శుక్రవారం మాట్లాడారు. నిర్మాణాలు చకచకా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేదల కోసం రూ.36 వేల కోట్ల ఖర్చుతో దాదాపు 400 ఇళ్లను నిర్మించటం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు.

(బన్సీలాల్‌పేట)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top