బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. చక్రపాణితోపాటు టీఎస్పీఎస్సీ సభ్యులుగా సి.విఠల్‌, మతీదుద్దీన్ ఖాద్రీ, బానోతు చంద్రావతి  బాధ్యతలు తీసుకున్నారు. వీరంతా ఆరేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్తో సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top