యువతిపై సామూహిక అత్యాచారం


నిందితుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు



గట్టు: ఒంటరిగా ఉన్న ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల గొర్లఖాన్‌దొడ్డి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అయిజకు చెందిన ఓ యువతిని నలుగురు యువకులు మాయమాటలతో నమ్మించి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకొచ్చారు.



చీకటిపడ్డ తర్వాత సదరు యువకులు యువతిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. చివరకు వారి నుంచి తప్పించుకున్న యువత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top