గుప్తనిధుల కోసం తవ్వకాలు.. చితకబాదిన గ్రామస్థులు


మహబూబ్‌నగర్: గుర్తు తెలియని ముఠా దేవాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం నక్కలపల్లి గ్రామ శివారులోని అడవి ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి జరిగింది.



ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు గ్రామస్తుల చేతికి చిక్కగా.. మరో నలుగురు పరారయ్యారు. చేతికి చిక్కిన వారికి దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top