'గాంధీ' వైద్య విద్యార్థిని అదృశ్యం


అత్తాపూర్ (రంగారెడ్డి): గాంధీ మెడికల్ కళాశాలలో చదివే ఓ విద్యార్థిని అదృశ్యం అయింది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన శ్రీనివాసచారీ కుమార్తె విజయలక్ష్మి(25) సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో చదువుతోంది. 


రోజు మాదిరిగానే సోమవారం ఉయదం కళాశాలకు వెళ్లినవిజయలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు తెలిసిన వారితోపాటు బంధువులు, స్నేహితుల్ని విచారించారు. ఫలితం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top