జీవవైవిద్య మండలికి నిపుణుల కమిటీ


హైదరాబాద్ సిటీ: జీవ వైవిద్య మండలికి నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. జీవి వైవిధ్య మండలి పరిరక్షణకు 8 నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.


వన్యమృగ సంరక్షణకు, జంతు, చేపల, ఆగ్రో, సంస్కృతి, ఆస్తుల పరిరక్షణ, వైద్య సంబంధ మొక్కల పరిరక్షణ, చైతన్య పరిచే కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top