ఆగస్టు 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి

ఆగస్టు 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి


సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి కానుంది. వివిధ కారణాల నేపథ్యంలో జూలై 1 నుంచి అమలు చేయాలన్న నిర్ణయాన్ని మరో నెల పాటు పోలీసు విభాగం వాయిదా వేసింది. అనేక కారణాలను విశ్లేషించిన పోలీసు విభాగం ఆగస్టు 1 నుంచి అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నెల రోజుల పాటూ వాహనచోదకులకు హెల్మెట్ వినియోగంపై కౌన్సిలింగ్ ఇచ్చి, వచ్చే నెల 1 నుంచి జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top