గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్రగాయాలు


మహబూబ్నగర్:  గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రగాయాలపాలైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం కుర్వపల్లిలో చోటుచేసుకుంది. కొత్త గ్యాస్ కొన్న నాశయ్య అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ వెలిగించేందుకు యత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది. సిలిండర్ను సరిగ్గా పెట్టకపోవడం వల్లే గ్యాస్ లీకై ఈ ప్రమాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది.



గ్యాస్ వెలిగించగానే ఒక్కసారిగా మంటలు అలమకున్నాయి. ఇంట్లో రెండు క్వింటాళ్ల పత్తి ఉంది. మంటలు పత్తికి అంటుకోవడంతో త్వరగా వ్యాపించినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top