మాజీ సర్పంచ్ ఆత్మహత్య
నాంపెల్లి మండలం రాందాస్తండాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి గ్రామ మాజీ సర్పంచ్ మెగావత్ పంత్యా(56) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.