గుండెపోటుతో ఫారెస్ట్ సెక్షన్ అధికారి మృతి
అచ్చంపేట (మహబూబ్నగర్): మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో అటవీ శాఖ అధికారి మార్నింగ్ వాక్ చేస్తూ.. గుండెపోటుతో మృతి చెందారు.
వివరాలు.. మహ బూబ్నగర్ జిల్లా అచ్చంపేట డీఎఫ్ఓ కార్యాలయ పరిధిలో పనిచేసే ఫారెస్ట్ సెక్షన్ ఆపీసర్ రతన్ రాజు(45) గుండెపోటుతో మృతిచెందారు. అటవీ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న రాజు ఆదివారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ఛాతిలో నొప్పిగా ఉందని పక్కనే ఉన్న జీపులో కుర్చున్నారు. అదే సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు సమాచారం.