వన్యప్రాణి వేటగాళ్ల అరెస్ట్
ఖమ్మం(పెనుబల్లి): పెనుబల్లి మండలం భవన్నపాలెం సమీపంలోని నీలాద్రి అడవుల్లో బుధవారం వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అడవి జంతువులను వేటాడుతున్నరనే సమాచారంతో అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. సమీప అడవిలో వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్లిన ఫారెస్టు అధికారులకు మృతి చెందిన చుక్కల దుప్పి, పక్కనే ఇద్దరు తుపాకీతో కన్పించారు.
దీంతో నిందితులైన పెనుబల్లి మండలం భవన్నపాలెం, బీజేఆర్ క్యాంప్లో డ్రైవర్.. షూటింగ్ ఎక్స్ఫర్ట్ అయిన సాధం శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా మైలవరం, రైస్మిల్లులో వర్కర్గా పనిచేస్తున్న సోమవరం చిట్టిబాబులను అదుపులోకి తీసుకొని సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సత్తుపల్లి శివారులో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చుతున్న కూరాకుల రామారావు, జల్లిపల్లి విజయ్కుమార్, ముడియం తిరుపతిరావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.