భోజనం వికటించి.. 200 మందికి అస్వస్థత


షాద్‌నగర్(మహబూబ్‌నగర్): విందు భోజనం వికటించి దాదాపు 200 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన సోమవారం షాద్ నగర్ లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్ నగర్ మండలం దూసకల్‌కు చెందిన అబ్బాయికి ఎలికట్ట అమ్మాయితో గత నెల 29న షాద్‌నగర్ పట్టణంలోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో వివాహమైంది.



పెళ్లికి విచ్చేసిన బంధువులు, మిత్రులందరూ విందు భోజనం చేశారు. మరుసటి రోజు భోజనం చేసిన వాళ్లందరికీ వాంతులు, విరోచనాలు  కావడంతో షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎలికట్టలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పాత్రలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం, వంటల్లో రుచి కోసం వాడే దినుసులు, నూనె సరిగ్గా లేకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని డాక్టర్ చందునాయక్ తెలిపారు. కాగా, బాధితులకు కావాల్సిన మందులు ఇచ్చి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి 20 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top