పుష్కరాల్లో ఎగిరే కెమెరాలు
భద్రాచలం: రానున్న గోదావరి పుష్కరాల్లో పటిష్ట భద్రతకు ఖమ్మం జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులోభాగంగా పుష్కరాల్లో ప్లయింగ్ (ఎగిరే) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కెమెరాలను జిల్లా కలెక్టర్ ఇలంబరితి శనివారం భద్రచలంలో పరిశీలించారు. జిల్లాకు సమీపంలోని ఛత్తీస్గఢ్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కెమెరా ఓ కిలోమీటర్ ఎత్తు వరకు వెళ్లి... 115 నిమిషాలు పాటు చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. సెకనుకు ఒకటి చొప్పున ఫొటోలు తీసే ఈ కెమెరాకు పావు గంటకోసారి బ్యాటరీని రీచార్జి చేయాల్సి ఉంటుంది. పుష్కరాల సమయంలో రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలు, ఘాట్ల వద్ద పరిస్థితిని జీపీఎస్తో అనుసంధానించి... వీటి ద్వారా కంట్రోల్ రూం నుంచి పోలీసులు తెలుసుకుంటారు.