ఐదుగురు మహిళల ఆత్మహత్యాయత్నం


మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరనం నెలకొంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. జిల్లాకేంద్ర శివారులోని 551 సర్వే నెంబర్‌ గల భూమిలో కొందరు పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు.



గురువారం వాటిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు, పోలీసులు ఆదేశించారు. దీనికి ససేమీర అన్న స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసన కారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇంతలో గుడిసెల్లో నివాసముంటున్న ఐదుగురు మహిళలు ఒంటి పై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top