మత్స్యకారుల ధర్నా
మహబూబ్నగర్ జిల్లా : ప్రభుత్వం నాణ్యమైన చేపల సీడ్ను సబ్సిడీ ద్వారా మత్స్య కార్మికులకు అందించాలని కోరుతూ గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మత్స్యకారులు ధర్నాకు దిగారు.
60 సంవత్సరాలు నిండిన ప్రతీ మత్స్యకారునికి ప్రతి నెలా రూ.1000ల ఆసరా పింఛన్ ఇవ్వాలని, జిల్లా, మండల కేంద్రాలలో శాశ్వత మార్కెటింగ్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది మత్స్యకార్మికులు పాల్గొన్నారు.