ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్!

ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్! - Sakshi


ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. మావోయిస్టులు సమావేశం అయినట్లు సమాచారంతో  తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా రొంపి సమీపంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.  కాగా పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top