పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం


మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాళ్లకల్ వద్ద ఓ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం  స్లీప్ ఫైన్ మాట్రస్ పరుపుల తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top