ఆర్టీసీ బస్సులో మంటలు


హైదరాబాద్: నగరంలోని బర్కత్ పుర వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బర్కత్‌పుర చౌరస్తా వద్ద జరిగింది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వెళ్తున్న 113 నెంబరు బస్సులో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలకు కారణాలు తెలియరాలేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top