ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం


హైదరాబాద్‌: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ)  కాలనీలోని ఆర్.టి.ఏ కార్యాలయంలో అగ్ని​‍ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఇన్వర్టర్ బ్యాటరీ, కొన్ని రికార్డులు, కంప్యూటర్లు, కార్డు ప్రింటర్‌ తగులబడ్డాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పి వేశారు. ఈ కారణంగా మంగళ, బుధవారాలు కార్యాలయం పనిచేయదని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top