రహదారిపై తగలబడిన ఏసీ కూలర్ల కంటైనర్


కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాదగిరి చౌరస్తా వద్ద మంగళవారం ఏసీ కూలర్లతో వెళ్తున్న ఓ కంటైనర్ దగ్ధమైంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలార్పేందుకు యత్నించారు. అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికి కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది.


షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కంటైనర్ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి కూలర్లతో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top