ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం!

ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం! - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గురువారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని ఎల్ బ్లాక్ లోని ఏడవ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సందర్శిస్తున్న నేపథ్యంలో శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సచివాలయ సిబ్బంది స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top