ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గురువారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని ఎల్ బ్లాక్ లోని ఏడవ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సందర్శిస్తున్న నేపథ్యంలో శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సచివాలయ సిబ్బంది స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.