ఫ్లైవుడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం


కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లిలోని జై భారత్ వుడ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో పరిశ్రమలోని 80 శాతం వరకు కలప దగ్ధమైనట్టు తెలుస్తోంది. ప్రమాద నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top