బావిలో పడి రైతు మృతి


నంగునూరు(మెదక్‌ జిల్లా): నంగునూరు మండలం రాంపూర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి(30) అనే రైతు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా, లేక ఎవరైనా కావాలని బావిలోకి తోశారా  అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top