వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకు మృతి


కరీంనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకులు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని వెదిరి గ్రామానికి చెందిన లింగయ్య(40), తన కొడుకు శశాంక్(7) తో కలసి ఆస్పత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.


లింగయ్య రామడుగులోని కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తాడు. అయితే శశాంక్‌కు అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం రాత్రి వీరు ఆస్పత్రికి వెళ్లేందుకు వెదిరి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై బస్సు కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వీరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top