పిల్లలను చంపి.. తండ్రి ఆత్మహత్య

పిల్లలను చంపి.. తండ్రి ఆత్మహత్య - Sakshi

శామీర్‌పేటలో పిల్లలను చెరువులో తోసి.. తనూ దూకాడు

 

శామీర్‌పేట్‌/ రసూల్‌పురా: పిల్లల్ని చెరువులో తోసి, తనూ దూకి తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదాయకర సంఘటన శామీర్‌పేట్‌ పెద్ద చెరువులో బుధవారం చోటు చేసుకుంది.  సికింద్రాబాద్‌లోని రసూల్‌పురా కృష్ణానగర్‌ కాలనీకి చెందిన కె.అర్జున్‌ (32), కౌసల్య దంపతులకు కూతురు పూజిత (10), కుమారుడు ధనుష్‌ (8) ఉన్నారు. అర్జున్‌ గతంలో ఆటో నడు పుతూ జీవనం సాగించగా ప్రస్తుతం ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం మధ్యా హ్నం కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లి, అటు నుంచి స్విమ్మింగ్‌పూల్‌కు వెళతానని చెప్పిన అర్జున్‌ ఇంటి నుంచి కూతురు, కుమారుడితో కలసి తన స్కూటీపై బయలు దేరాడు. అయితే, రాత్రి అయినా తిరిగిరాలేదు.



కాగా మంగళవారం అర్థరాత్రి పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నపుడు శామీర్‌పేట్‌ చెరువు కట్టపై ఇదే ద్విచక్రవాహనం (స్కూటీ) నిలిపి ఉన్నట్లు గమనించిన స్థానిక పోలీసులు ఆ బైక్‌ డిక్కీ తీయగా అందులో స్విచ్‌ఆఫ్‌ చేసి ఉన్న సెల్‌ ఫోన్‌ దాని కింద ఓ నోట్‌ (పత్రం) లభ్యమైంది.  పోలీసులు లెటర్‌లో ఉన్న నంబర్‌కు సమాచా రమిచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం శామీర్‌పేట్‌ పెద్ద చెరువులో ఓ గుర్తు తెలియని శవం నీటిపై తేలుతుండడం గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  అర్జున్‌ భార్య కౌసల్య, కుటుంబీకులు వచ్చి, చెరువులో   పూజిత మృతదేహాన్ని గుర్తించి భోరున విలపిం చారు.  గజ ఈత గాళ్ళను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గాలింపు చేపట్టగా చెరువు తూములో కుమారుడు ధనుష్‌ (8) మృతదేహాం లభ్యం కావడంతో తాళ్ళతో బయటకు తీశారు.



చీకటి పడడంతో గజఈత గాలింపు చర్యలు నిలిపివేశారు. తండ్రి మృతదేహం లభించలేదు. వ్యా పార లావాదేవీల్లో భాగస్వాములు మోసం చేసినందుకే  అర్జున్‌ మనస్తాపంతో  ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని సోదరుడు, బంధువులు పేర్కొన్నారు. ఫైనాన్స్, చీటీలు, బియ్యం వ్యా పారాల్లో అర్జున్‌తో పాటు అతని స్నేహితులు ఎల్లేష్, శ్రీనివాస్, బిక్షపతి భాగస్వాములని ఇటీవల విబేధాలు రావడంతో ఫైనాన్స్, బియ్యం వ్యాపా రాల్లో సెటిల్‌ కాగా, చీటీల వ్యాపారంలో భాగ స్వాములుగా ఉన్నారని లక్షల్లో చీటీ పాట పాడి న వారు డబ్బుల కోసం ఒత్తిడి తీసుకు రావడంతో తట్టుకోలేకపోయాడన్నారు. సికింద్రా బాద్‌ కొత్త ఎల్లయ మోమరియల్‌ పాఠశాల్లో పూజిత ఆరో తరగతి, ధనుష్‌ మూడో తరగతి చదువుతున్నారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top