తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ, కొడుకు మృతి


హైదరాబాద్: నగరంలోని మల్కాజిగిరిలో ఓ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ వివాదస్పదంగా మారింది. గొడవ కాస్తా చిలికీ చిలికీ గాలివానాలా మారింది. ఇరువురి మధ్య మాటామాట పెరిగి పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కొడుకు మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘర్షణకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top