చంద్రబాబు వల్లే రైతు ఆత్మహత్యలు: కడియం
వరంగల్: రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు వల్లే రైతులు చనిపోతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా హన్మకొండలో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ దిగువ సీలేరులో 54శాతం, కృష్ణపట్నం ప్రాజెక్టు ద్వారా రావాల్సిన విద్యుత్ ఇవ్వనందునే తెలంగాణలో విద్యుత్కోతలు ఎక్కువయ్యాయన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ జలాలను రెండో పంటకు నీరు విడుదల చేసుకుంటూ తెలంగాణలోని భూములను బీళ్లుగా మార్చారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే భద్రాచలం డివిజన్లోని 7మండలాలు ఆంద్రప్రదేశ్లో కలిపినందుకు బీజేపీకి ఓటు వేయాలా? 10 ఏళ్లు కేంద్రంలో, 15 ఏళ్లు ఢిల్లీలో పాలన సాగించినా ఒక్క సీటు గెలుచుకోని కాంగ్రెస్కు ఓటు వేయాలా? అని కడియం ప్రశ్నించారు.