అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఖమ్మం : ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలం తుమ్మలలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాదతో పురుగుల మందు తాగి శనివారం ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుమ్మలకు చెందిన వీరా స్వామి అనే రైతు సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.