అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మన్నెగూడెంకు చెందిన ఒక రైతు అప్పుల బాధతో మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. బట్టు రాజయ్య(38) అనే రైతు 4 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో వరి పంటపెట్టాడు. అయితే నీళ్లు లేక పంట ఎండిపోవడం, అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువకావడంతో ఆవేదనకు గురైన రాజయ్య ఈ రోజు ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య మారెక్క, నలుగురు పిల్లలు ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top