విద్యుత్ షాక్తో రైతు దుర్మరణం
మహబూబ్నగర్ : పొలం పనులకోసం వెళ్లిన రైతు విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన లట్టుపల్లి పరిధిలోని ఊడుగులకుంట తండాకు వెళ్లే రహదారిలో సోమవారం ఉదయం జరిగింది. ఊడుగులకుంట తండాకు వెళ్లే రహదారిపై 11కెవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. గోపాల్గౌడ్(55)అనే రైతు పొలంలో నీళ్లు పెట్టేందకు ఉదయాన్నే బైక్పై వెళ్లాడు. పొగమంచులో కనిపించక తెగిపడిన విద్యుత్వైర్లును తాకాడు. దీంతో విద్యుత్ షాక్తో అక్కడిక్కడే మృతి చెందాడు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తీగలు తెగిపడ్డాయని గ్రామస్తులు మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత రైతుకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు.