పంట నష్టం భరించలేక గుండెపోటుతో రైతు మృతి


మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండలానికి చెందిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని తండిగిడ్గి పంచాయతీ కుసుమర్థి గ్రామానికి చెందిన చిన్నమల్లికార్జున్ (50) పదెకరాల్లో వరిసాగు చేశాడు. కొద్దిరోజుల్లోనే పంట చేతికి అందాల్సి ఉంది.



ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా అకాలవర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఆందోళనతో ఉన్నాడు. బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన ఆయన.. వరిపంట నేలకు వాలి, గింజరాలి పోవడంతో దిగాలు చెందాడు. తనకు ఉన్న రూ.లక్ష అప్పు తీరేదారి కన్పించక గుండెపోటుకు గురై మృతి చెందాడు.

(మాగనూర్)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top