విద్యుదాఘాతంతో రైతు మృతి


బాలనగర్ (మహబూబ్‌నగర్) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం రాంరెడ్డి గూడలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. రాంరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ రైతు శనివారం వ్యవసాయ బావి వద్ద మోటర్ మరమ్మత్తులు నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top