విద్యుదాఘాతంతో రైతు మృతి
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామ శివారులో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. రాగంపేట గ్రామానికి చెందిన బూతగడ్డల వెంకటేశం(41) అర్నకొండలో కిరాయికి ఉంటూ కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. కౌలుకు తీసుకున్న పొలంలో బావి వద్ద విద్యుదాఘాతానికి గురై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.