కరెంట్ షాక్తో రైతు మృతి
హైదరాబాద్: అడవిపందుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తగిలి యువ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మూచింతలలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్(28) తెల్లవారుజామున బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కంచెగా ఏర్పటు చేసుకున్న విద్యుత్ తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.