వివస్త్రను చేశాడని ఫిర్యాదు చేయడంతో..

వివస్త్రను చేశాడని ఫిర్యాదు చేయడంతో.. - Sakshi


కరీంనగర్‌: అకారణంగా తనపై ఫిర్యాదు చేసి పరువు తీశారని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం వెలుగుచూసింది.



వివరాల్లోకి వెళ్తే..  గ్రామానికి చెందిన ఏడెల్లి భూమిరెడ్డి(32), శ్రీనివాస్‌ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భూమి సాగు చేయడానికి పొలానికి వెళ్లిన భూమిరెడ్డిని అతని తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయన భార్య సునీత కలిసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో శ్రీనివాస్‌ రెడ్డి భార్య సునీత తనను వివస్త్రను చేసి దాడి చేశారంటూ.. హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. విషయం ఊరంతా తెలియడంతో అవమానంతో కుంగిపోయిన భూమిరెడ్డి ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భూమిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top