అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


కొల్లాపూర్: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం బోయలపల్లి (నర్సింగరావు పల్లి) గ్రామంలో ఆదివారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్ల వెంకటస్వామి (40) తనకున్న రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చేశాడు. సాగు కోసం, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనంటూఎప్పుడూ మదన పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన రైతులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top